KMM: గిరిజన అభివృద్ధి శాఖ ఏటీడీవో కార్యాలయాన్ని ఖమ్మం కలెక్టరేట్ కు మార్చాలని PDSU ఖమ్మం జిల్లా అధ్యక్షులు గోకినపల్లి మస్తాన్ అన్నారు. శనివారం PDSU ఆధ్వర్యంలో గిరిజన అభివృద్ధి శాఖ జిల్లా అధికారి డి.డి. విజయలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఎస్టీ బాలుర వసతి గృహంలోనే ఏటీడీవో కార్యాలయం కొనసాగుతుండటంతో వసతి గృహ నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.