GNTR: అమరావతి కొత్త రైలు మార్గ పనులు ఎర్రుపాలెం నుంచి ప్రారంభమయ్యాయి. గుంటూరులో భూసేకరణ పెండింగ్లో ఉండటంతో, తొలుత ఎర్రుపాలెం-కొత్తపల్లి మధ్య 21.2 కి.మీ పనులకు రూ. 415.63 కోట్లతో రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. మొత్తం 57 కి.మీ ప్రాజెక్టును రూ. 2,245 కోట్లతో నాలుగేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యం. ఈ గడువులోగా పనులు ముగియాలంటే భూసేకరణను ప్రభుత్వం వేగవంతం చేయాల్సి ఉంది.