SRCL: కేంద్ర బీజేపీ ప్రభుత్వం సిలిండర్ ధరలు పెంచి సామాన్యుడిని ఇబ్బంది పెడుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి ముషం రమేష్ అన్నారు. సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఖాళీ సిలిండర్తో సీపీఎం నాయకులు సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ ప్రభుత్వం సిలిండర్ ధరలు పెంచి పేదవాడి నడ్డి విరిచిందని మండిపడ్డారు. పెరిగిన ధరలను తగ్గించాలన్నారు.