NRPT : నారాచణపేట మండలం బసిరెడ్డిపల్లిలో హత్యకు గురైన చిన్నారి తేజశ్రీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేస్తూ PYL, POW ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఆర్థిక సహాయం అందించాలని గ్రామ రహదారిపై ఆందోళన చేశారు. సీఐ శివశంకర్ జోక్యం చేసుకుని, వారి డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వగా నిరసన విరమించారు.