HYD: జలమండలి ప్రజలతో మమేకమయ్యేందుకు ‘బస్తీ బాట’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం శుక్రవారం నుంచి వారానికి నాలుగు రోజులు అమలులో ఉంటుంది. ఈ సందర్భంగా, ఎండీ నుంచి వార్డు మేనేజర్ల వరకు అధికారులు బస్తీలు, కాలనీల్లో ప్రత్యక్షంగా పర్యటించి నీరు, సీవరేజ్ సమస్యలను గుర్తించి, తక్షణ పరిష్కార చర్యలు చేపడతారు.