SRCL: వేములవాడ శ్రీ భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ నెలకొంది.. సెలవు రోజు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి భీమేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు. రాజరాజేశ్వర స్వామి ఆలయం ఎదుట ఎల్ఈడీలో రాజరాజేశ్వరి స్వామి వారి మూల విరాట్ను దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.