వికారాబాద్ జిల్లాల్లో రోజురోజుకు భూగర్భ జలాల స్థాయి పడిపోతోంది. అనేక ప్రాంతాల్లో బోరు బావులు ఎండిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జిల్లాలో భూగర్భ జలాలు సగటున 12.87 మీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వేసవి వేళ భూగర్భ జలాలు పడిపోతున్నాయి.