SRCL: పేదల పెన్నిధి ముఖ్యమంత్రి సహాయనిధి అని కాంగ్రెస్ ఒకటవ వార్డు అధ్యక్షుడు ఎలుక తిరుపతి అన్నారు. సిరిసిల్ల పరిధిలోని రగుడులో రూ. 67,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులు భీమనపల్లి అంజయ్య, తంశెట్టి ఎల్లవ్వ, బొజ్జ వెంకటేశంకు ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంలా ఉపయోగపడుతుందన్నారు.