KMM: జిల్లా కలెక్టరేట్లో ఫిబ్రవరిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఘనంగా సన్మానించారు. సుమారు 30 నుండి 35 ఏళ్ల పాటు ప్రభుత్వ సేవలో ఉండి, ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేసిన ఉద్యోగులకు కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రిటైర్మెంట్ తర్వాత వారి జీవితం ప్రశాంతంగా, ఆరోగ్యవంతంగా సాగాలని ఆకాంక్షించారు.