MLG: ఈ రోజు చంద్రగ్రహణం కారణంగా మంగపేట మండలం మల్లూరులో గల స్వయంభు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు. ఉదయం స్వామి వారికి ఆరాధన, నివేదన చేసి (ద్వారా బంధనం) ఆలయ తలుపులు మూసివేసినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి రెవెల్లి మహేష్ తెలిపారు. బుధవారం దేవాలయ సంప్రోక్షణ అనంతరం స్వామివారి దర్శనం యధావిధిగా కొనసాగుతుందన్నారు.