JN: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డినీ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లం అశోక్ మాట్లాడుతూ… గొర్రెలు, మేకల సంక్షేమం కోసం బడ్జెట్లో 10వేల కోట్లు కేటాయించాలని, దళారుల ప్రమేయం లేకుండా నగదు బదిలీ ద్వారా రెండవ విడత గొర్రెలను పంపిణీ చేయాలని కోరారు.