SKLM: మెలియాపుట్టి మండల పట్టు పురంలో ఎస్సై మహ్మద్ అమీర్ ఆలీ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు చాపర గ్రామానికి చెందిన ఆర్.వెంకటేశ్ ద్విచక్ర వాహనంపై మద్యం సీసాలు తీసుకెళ్తుండగా, అతనిని తనిఖీ చేయగా 36 మద్యం సీసాలు అతని నుంచి స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.