BPT: కర్లపాలెంలోని ‘వజ్రపహార్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా చేపట్టిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జగదీష్ నాయక్ వెల్లడించారు. 39 మంది పోలీసు సిబ్బందితో ఈ దాడులు నిర్వహించామని తెలిపారు.