WGL: చెన్నరావుపేట మండలం రాజకీయాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో BRS తరుపున కంది శ్వేతారెడ్డి సర్పంచ్గా గెలిపొంది అదే పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఆమె భర్త కంది కృష్ణ చైతన్య రెడ్డి ఇవాళ కాంగ్రెస్లో చేరారు. భార్య ఒక పార్టీలో, భర్త మరో పార్టీలో ఉండటంతో స్థానిక నాయకుల్లో ఆందోళన నెలకొంది.