MDK: శివంపేట మండలంలోని కొత్తపేటలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి రాజిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామ అభివృద్ధి, పార్టీ బలోపేతానికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.