PDPL: రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో మేదరి బస్తిలో రోడ్ల వెడల్పు కార్యక్రమం కొనసాగుతోంది. పాత విద్యుత్ స్తంభాలను విద్యుత్ శాఖ అధికారులు తొలగిస్తున్నారు. ఇవాళ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని రాం మందిర్ ఏరియా సబ్ స్టేషన్ అధికారులు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.