MNCL: సింగరేణిలో వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఇవాల బెల్లంపల్లి శాంతిఖని గని ఆవరణలో TBGKS ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. అనంతరం గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హాకు వినతిపత్రం అందజేశారు. కొన్ని నెలలుగా బోర్డు నిర్వహించకపోవడంతో అనారోగ్యంతో ఉన్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.