SDPT: బెజ్జంకి మండలం తిమ్మాయపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలు ఎత్తుకుని పోతారాజుల విన్యాసాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో మొక్కులు సమర్పించారు. గ్రామ ప్రజల ఆయురారోగ్యాలు, వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థించారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామస్థులు పాల్గొన్నారు.