WGL: గీసుకొండ(M) కేంద్రంలోని కొమ్మల గ్రామంలో నిర్వహించనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.