WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరుకుడు వెంకటయ్య బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో కాంట్రాక్టర్ రాజ్యం నడిచిందని ఆరోపిస్తూ, ప్రస్తుతం ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు ప్రజల అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ పై పార్టీ మార్పులు, కమిషన్ ఆరోపణలతో విమర్శలు గుప్పించారు.