SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లిలో ఉన్న బొంతపల్లి వీరభద్ర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు.