NLG: జిల్లా బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఏ. సతీశ్ కుమార్ విజయం సాధించారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి నరసింహపై 181 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉపాధ్యక్షులుగా స్వామి గౌడ్, ఏ. సంధ్యారాణి, ప్రధాన కార్యదర్శిగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీగా అమరావతి, కోశాధికారిగా ఫిరోజ్, క్రీడా కార్యదర్శిగా ప్రసన్నకుమార్ ఎన్నికయ్యారు.