WNP: మార్చి 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ వివాదాల పరిష్కారానికి ఒక మంచి అవకాశమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్. సునీత తెలిపారు. మంగళవారం కోర్టు ఆవరణలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజీపడదగిన క్రిమినల్, యాక్సిడెంట్ కేసులను త్వరగా పరిష్కరించుకోవాలని, దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆమె సూచించారు.