BHNG: రాజాపేట మండల కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ మండల ప్రఖండ అధ్యక్షులు జ్ఞానేందర్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2వ తేదీన వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహిస్తున్నట్లు నిర్వాహక బృందం తెలిపారు. ఆదివారం ఏకాదశి పర్వదినం రోజున శ్రీ రామకృష్ణ సాయి మందిరంలో ఆహ్వాన పత్రాలకు ప్రత్యేక పూజలు జరిగిన అనంతరం కరపత్రాల పంపిణీ చేపట్టారు.