NLG: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల పురపాలిక పరిధిలోని శివనేనిగూడెం గ్రామస్థులు మంగళవారం రాస్తారోకో చేపట్టారు. రెండు రోజుల క్రితం బైక్ ప్రమాదంలో గాయపడిన మహిళా బాధితురాలికి నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితుడిని పట్టుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.