WNP: ఆపదలో ఉన్న పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంతో పాటు, వారికి ఆర్థిక భరోసా కల్పించడంలో ప్రజా ప్రభుత్వం ముందుంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 168 మంది లబ్దిదారులకు రూ. 38,99,500 విలువ గల సీఎం సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.