KMR: విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాల్సిన టీచర్లు బాహాబాహీకి దిగిన ఘటన నస్రుల్లాబాద్ మండలంలో శనివారం చోటు చేసుకుంది. బొమ్మన్ దేవ్పల్లి ZPHSలో విధులు నిర్వహిస్తున్న నంద్యాల శ్రీనివాస్ తోటి ఉపాధ్యాయుడైన రామోజీ శ్రీనివాస్తో వ్యక్తిగత కక్షల కారణంగా ఘర్షణకు దిగారు. ఈ మేరకు నంద్యాల శ్రీనివాస్ కుర్చీతో రామోజీ శ్రీనివాస్ తలపై కొట్టాడు.