SDPT: రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించినప్పుడే ప్రమాద రహిత సిద్దిపేటను సాకారం చేసుకోవచ్చని ట్రాఫిక్ SIలు గోపాల్ రెడ్డి, ఉమేష్ పేర్కొన్నారు. ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా గురువారం సిద్దిపేట బస్టాండ్ వద్ద వాహనదారులకు, ప్రయాణికులకు ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదన్నారు.