SRPT: అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామ శివారులో జాతీయ రహదారి 365పై, సోమవారం రాత్రి కారు అదుపుతప్పి కల్వర్టుకు ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి గాయాలు కాగా, స్థానికులు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.