RR: మూసీ ప్రాజెక్టులో గృహాలు కోల్పోతున్న బాధితులకు బాసటగా నిలిచే క్రమంలో నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు రానున్నారని బీజేపీ నార్సింగి సర్కిల్ అధ్యక్షుడు నగేష్ యాదవ్ తెలిపారు. పరామర్శ యాత్ర బాపూఘాట్లో మొదలవుతుందన్నారు. టిప్పుఖాన్ బ్రిడ్జ్, గంధంగూడ మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు గండిపేటకు ఆయన చేరుకుంటారని వివరించారు.