NZB: రుద్రూర్ మండల పరిధిలోని ఆహార సాంకేతిక కళాశాల వద్ద శుక్రవారం రాత్రి అక్బర్ నగర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మొరం కుప్పను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతూ అక్బర్ నగర్ గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.