MNCL: లక్సెట్టిపేట మండలంలోని కొత్త కొమ్ముగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో ‘పూర్వ ప్రాథమిక విద్య ప్లే కం రీడింగ్ కార్నర్ రూమ్’ను ఎంఈవో శైలజ మంగళవారం ప్రారంభించారు. పూర్వ శిశు విద్యార్థులకు ఈ రీడింగ్ రూమ్ ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటరావుపేట్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు పర్వీన్ సుల్తానా, గ్రామ సర్పంచ్ సందెల సుజాత, ఉపసర్పంచ్ బొప్పు సుమన్ పాల్గొన్నారు.