KMR: బిక్కనూర్ మండల టోల్ ప్లాజా సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. శనివారం తెల్లవారుజామున 44వ జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్తున్న డీసీఎం నుంచి నాలుగు అల్లం పేస్ట్ కాటన్లు జారిపడ్డాయి. దీనిని గమనించిన టోల్ సిబ్బంది, మరో వాహనంలో వెళ్లి లారీని వెంబడించి ఆ బాక్సులను డ్రైవర్కు భద్రంగా అందజేశారు. సిబ్బంది నిజాయితీని లారీ యజమాని అభినందించారు.