SDPT: BRS ఎమ్మెల్యేల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ అనంతరం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ చేస్తున్న అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తే సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు.