KNR: కరీంనగర్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ రాష్ట్ర కమిటీ తీర్మానం మేరకు ఈనెల 30న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఫోరం కరీంనగర్ జిల్లా ఛైర్మన్ కనకం కుమార్ స్వామి మాట్లాడుతూ.. ఉద్యమకారుల హక్కుల కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం హామీలు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.