NRML: నిర్మల్ జిల్లా కేంద్రంలోని పదవ తరగతి సమాధాన పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని ఆర్జేడీ సత్యనారాయణ గురువారం సందర్శించారు. డీఈవో భోజన్నతో కలిసి పనులను పర్యవేక్షిస్తూ, మార్కుల నమోదులో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులకు తాగునీరు, కనీస వసతులు కల్పించాలని ఆదేశించారు.