SDPT: అక్బర్పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. సిద్దిపేట వైపు నుంచి అతివేగంగా వస్తున్న కారు, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అతన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.