JBL: తెలంగాణ ఉద్యమకారుల అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో రేగొండ ఎస్సై సుధాకర్ ఆధ్వర్యంలో సోమవారం ముందస్తు చర్యలు చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పలువురు ఉద్యమకారులను పోలీసులు బైండోవర్ చేశారు. బైండోవర్ అయిన వారిలో పున్నం రవి, రూపురెడ్డి లింగారెడ్డి, పట్టెం శంకర్, గోగుల అశోక్ రెడ్డి, పత్తి బుచ్చిరెడ్డి, గండి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.