MNCL: గ్రామ ఎన్నికల నేపథ్యంలో తాండూరు మండలంలో సోమవారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మండలంలోని రేపల్లె వాడ వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కారులో వస్తున్న మండల TDP అధ్యక్షుడి కారును ఆపి చెక్ పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించారు. ASI రవి, DT కల్పన పాల్గొన్నారు.