KDP: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ తమ హయాంలోనే నిర్మించబడ్డాయని CM చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పడం హాస్యాస్పదమని, అవాస్తవమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసి రెడ్డి అన్నారు. శుక్రవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యాఖ్యలు ‘బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయఅంత’ అన్నట్లున్నాయని విమర్శించారు.