ADB: నార్నూర్ మండలంలోని కొత్తపల్లి(H) గ్రామంలో ఆదివారం సర్పంచ్ చౌహన్ డిగంబర్ చలి వేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సక్రు, అగన్, గ్రామస్థులు పాల్గొన్నారు.