KMR: రామారెడ్డి మండలంలోని పోసానిపేట గ్రామానికి చెందిన నారెడ్డి సునంద గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఆమె ప్రాథమిక విద్యను సొంత ఊరిలో, పదో తరగతి వరకు రామారెడ్డి జడ్పీహెచ్ఎస్ఈ అభ్యసించారు. మారుమూల గ్రామం నుంచి వెళ్లి హైదరాబాద్లో ఉన్నత పదవిని అధిష్ఠించడం పట్ల గ్రామస్థులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.