WGL: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నర్సంపేట మున్సిపల్ ఛైర్పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్ అన్నారు. 5వ వార్డులో స్థానిక నేతలతో కలిసి ఛైర్పర్సన్ పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నర్సంపేట పట్టణ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు.