HNK: హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నేరెళ్ల వేణుమాధవ్ ప్రాంగణంలో గ్రామీణ ప్రకృతి ఉత్పత్తుల సంతను నిర్వహించారు. స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ ప్రాంత సంపర్కు ప్రముఖ్ రవీందర్, సేంద్రియ వ్యవసాయ ప్రముఖ్ రామ్ రెడ్డి సంతను ప్రారంభించారు. సంతను నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని, సంతలో సేంద్రియ ఉత్పత్తులు, గో-ఆదారిత ఉత్పత్తులు లభిస్తాయన్నారు.