PDPL: ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన గంగపుత్రులు ఆదివారం ధర్మపురి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను కలిసి శ్రీ గంగమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలకు ఆహ్వాన పత్రిక అందజేశారు. మార్చి 12, 14 తేదీల్లో జరిగే వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేయాలని కోరారు. గ్రామంలో వేడుకల కోసం ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.