ATP: జనగణనలో స్వీయ గణనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆదివారం అనంతపురంలో ‘సెన్సస్ 5K రన్’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఉ. 6:30 గంటలకు ఆర్ట్స్ కళాశాల వద్ద ప్రారంభమయ్యే ఈ పరుగు టవర్ క్లాక్, సప్తగిరి సర్కిల్, రైల్వే స్టేషన్ మీదుగా తిరిగి కళాశాల వద్దే ముగుస్తుందన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.