ELR: వ్యవసాయ సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించేందుకు మద్దతు ధర గ్యారెంటీ చట్టం ఎంతో అవసరమని అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు అశోక్ ధావలె అన్నారు. శనివారం జంగారెడ్డిగూడెంలో ఉద్ధరాజరామం మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైతు సదస్సు జరిగింది. సాగులో ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కార మార్గాలపై రైతులకు దిశానిర్దేశం చేశారు.