NDL: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబదేవి, మల్లికార్జున స్వామి క్షేత్రాన్ని శనివారం రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఛైర్మన్ సొల్ల బొజ్జి రెడ్డి సందర్శించారు. కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అటు, ఈవో శ్రీనివాసరావు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.