KMR: రాజంపేట పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆకాంక్షించారు. శివాయిపల్లి గ్రామంలో నిర్వహించిన పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.