ADB: ఆదిలాబాద్ రూరల్ ఎస్ఐ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో గురువారం రాణాదివ్వే నగర్ కాలనీలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్, సీట్బెల్ట్ ప్రాధాన్యతను వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు. ప్రమాదాల నివారణలో ప్రతి పౌరుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించి బాధ్యతగా వ్యవహరించాలని ఎస్ఐ కోరారు.